జనసేన తీర్ధం పుచ్చుకున్న గాదరాడ ఎంపీటీసీ

తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం గాదరాడ గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి బలరామకృష్ణ దంపతులు మరియు వారి అనుచరులు వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసి తూర్పుగోదావరి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఇంచార్జ్ మేడా గురుదత్ ప్రసాద్, అనపర్తి నియోజకవర్గ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఇతర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.