దాడిచేసిన వైఎస్సార్సీపి నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన జనసేన

ఎచ్చెర్ల నియోజకవర్గం, జి.సిగడాం మండలం నిద్దాం పంచాయతీ కి చెందిన ప్రభుత్వ భూమిని వైఎస్సార్సీపి నాయకులు జెసిబిలతో నున్నగా ఆక్రమించుకుంటే జనసేన పార్టీ తరుపున గెలిచిన ఆ పంచాయతీ సర్పంచ్ మీసాల రవికుమార్ ప్రశ్నించినందుకు, సర్పంచ్ మీద, కార్యకర్తల మీద వైఎస్సార్సీపి నాయకులు దాడి చెయ్యడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా జనసేన పార్టీ నాయకులు గేదెల చైతన్య, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకుడు డా. విశ్వక్షేణ్, అర్జున్ భూపతి, రాజాం నాయకులు ఎన్ని రాజు ఆ మండల పోలీసు స్టేషనుకు వెళ్లి ఎస్సైతో మాట్లాడి వారిపై పై తగిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ పని చేస్తున్న జెసిబిని సిజ్ చేయ్యాలి అంటూ ఎస్సైకి ఆ పంచాయతీ సర్పంచ్ మీసాల రవికుమార్ చెప్పడం జరిగింది. ఎస్సై శుక్రవారం ఉదయం 10 గంటలకు జెసిబిని స్టేషన్ కి తీసుకొస్తామని మాట ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ఉదయం 10 గంటల సమయానికి జెసిబి స్టేషన్ కి తీసుకురాకపోతే స్టేషన్ దగ్గర ధర్నా చేస్తామని గట్టిగా ఎస్సైకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పంచాయతీ జనసేన పార్టీ ఎంపిటిసి అభ్యర్థి బాలి అప్పలనాయుడు, జి.సిగడాం యువనాయకులు తాలబత్తుల పైడిరాజు, ఉదయ్, గురుప్రసాద్, రామకృష్ణ, కాకర్ల బాబాజీ అలాగే ఆ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.