రైతు బాంధవుడు, స్వతంత్ర సమరయోధుడు ఆచార్య ఎన్.జి.రంగ జయంతి సందర్భంగా నివాళులర్పించిన గాదె

పొన్నూరు నియోజకవర్గం, ఆదివారం రైతు బాంధవుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ వాది, పార్లమెంట్ సభ్యుడు, రైతు నాయకుడు, రైతాంగ ఉద్యమపితగా పిలవబడే ఆచార్య గోగినేని రంగనాయకులు జయంతి సందర్భంగా పొన్నూరు టౌన్ లో జి.బి.సి రోడ్డు వద్ద ఉన్నటువంటి ఎన్జీరంగా భారతీదేవిల స్ఫూర్తి నిలయం వద్ద జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, తాళ్లూరి అప్పారావు, దేశంశెట్టి సూర్య, గడ్డమూరి చందు, తన్నీరు గంగరాజు మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.