25వ డివిజన్లో పర్యటించిన గాదె

గుంటూరు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ పాటంశెట్టి వెంకటేశ్వరరావు కాలనీ, జోసఫ్ నగర్, నేతాజీ నగర్ ప్రాంతాలలో సందర్శించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. ఈ తుఫాను వలన గత మూడు రోజుల నుంచి వర్షపు నీరు, డ్రైనేజీ, కాలవలోని నీరు కానీ ఎటు పోలేని స్థితిలో ఈ కాలనీవాసులు నివసిస్తున్నారు. అది కాకుండా గత రెండు రోజుల నుంచి కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఫోన్లు చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది, వస్తున్నాం, చేస్తున్నామని ఏదో విధంగా చెప్తున్నారే కానీ వచ్చి ఇక్కడ ఉన్న సమస్యని పరిష్కరించే విధంగా ఏ ఒక్క అధికార పార్టీ నాయకులు కానీ ఈ వార్డు యొక్క కార్పొరేటర్ గాని, ప్రభుత్వ అధికారులు గాని వచ్చి వీరి సమస్యని తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వమో ప్రజలు గమనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ ప్రెసిడెంట్ కదిరి సంజయ్, జిల్లా నాయకులు నారదాసు రామచంద్ర ప్రసాద్, ఆళ్ల హరి, నెల్లూరు రాజేష్, చింతకాయల శివ, వార్డు జనసైనికులు పాల్గొన్నారు.