సీతారాముల కళ్యాణ మహోత్సవంలో గాదె వెంకటేశ్వరావు

వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు లంక గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలకు అన్నసమారాధన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు చేతుల మీద ప్రారంభించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం చలమలశెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్థుల సహకారంతో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇస్మాయిల్ బేగ్, బోడయ్య, సోమరౌత్ అనురాధ, మండల ప్రెసిడెంట్ చలమయ్య, పెసర్లంక ఎంపిటీసి సుబ్రహ్మణ్యం, చిలువూరు లంక ప్రెసిడెంట్ కోట నరేష్, కమ్మెల రవీంద్ర,రావూరి అంజయ్, రావూరి పాండురంగారావు, ఈమని మణికంఠ, సగ్గున శంకర్, శ్రీరామ కృష్ణయ్య లు మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.