ఆర్.ఎస్.వి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న గాదె వెంకటేశ్వరరావు

విజయవాడ: రైతు స్వరాజ్ వేదిక(ఆర్.ఎస్.వి) అధ్యక్షతన విజయవాడలో నిర్వహించిన కౌలు రైతుల అవస్థలపై ప్రజావేదిక కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపి కౌలు రైతులు పడుతున్న బాధలపై జనసేన పార్టీ గతంలో నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు ఏమి చేసిందో ప్రస్తుతం ఏ విధంగా వారికి సహాయం చేస్తుందో అలాగే భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా వారికి అండగా ఉంటారో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రాజేష్, యడ్ల వెంకటేశ్వరరావు, అంకమ్మరావు పాల్గొన్నారు.