పొన్నూరు నియోజవర్గం మంచాల గ్రామంలో పర్యటించిన గాదె వెంకటేశ్వరరావు

జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పొన్నూరు నియోజవర్గం మంచాల గ్రామంలో పర్యటించారు, ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు వారు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి 40 రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. బుధ్వారం ధాన్యం కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం మొత్తం మొలకలు వచ్చి బూజు పట్టి పాడైపోయింది కానీ రైతులకు న్యాయం చేయటం చేతకాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. రైతులకు న్యాయం జరిగే వరకు ఈ బూజుపట్టిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు మేము దీక్ష చేయడానికి వెనుకాడబోమని జిల్లా జనసేన అధ్యక్షులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.