మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుకి కరోనా సోకడంతో బుధవారం వడ్డేశ్వరంలో గల శివాలయంలో మరియు బ్రహ్మానందపురంలోని గోసాల నందు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గోమాతలకు ఆహారాన్ని అందించి చిల్లపల్లి శ్రీనివాసరావు కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ దేవుడిని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామలనాగేశ్వరావు, జిల్లా సహాయ కార్యదర్శి బడే కోమలి, తాడేపల్లి నాయకులు దాసరి శివ నాగేంద్ర, తాడేపల్లి ఉపాధ్యక్షులు తిరుమలశెట్టి శ్రీధర్, మరియ వెంపల సాయి, సాయి చంద్, షఫీ జనసైనికులు పాల్గొన్నారు.