విద్యుత్ చార్జీలను తగ్గించాలని గజపతినగరం జనసేన వినతి

గజపతినగరం నియోజకవర్గం, జనసేన పార్టీ దత్తి రాజేరు మండలంలో శనివారం జిల్లా మరియు గజపతినగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకరాలు మాజీ మంత్రి వర్యులు శ్రీమతి పడాల అరుణమ్మ మరియు దత్తి రాజేరు మండలం అధ్యక్షులు చప్పా అప్పారావు, గజపతినగరం మండలం అధ్యక్షులు, మునకాల జగన్ (ఎంజేఅర్) ఆధ్యర్యంలో పెంచిన విద్యుత్తు ధరల గురించి మరియు అద్దాంతర కరెంటు కోతల గురించి దత్తి రాజేరు మండలంలో కోమటిపల్లి కరెంటు సబ్స్టేషన్ కు వెళ్లి నిరసన తెలిపి ఏఈకి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్, పడాల శరత్ చంద్ర, యస్వంత్,మండల నాయకులు సారికి మురళి, మార్పిన అప్పలనాయుడు, ఆల్తి రామారావు, ప్రవీణ్ కుమార్, బంగార్రాజు, గణేష్, రాజేష్, పల్లి సత్యనారాయణ , కుప్పం వెంకటరమణ వీర మహిళలు, బోనెల లక్ష్మి, మామిడి పెంటమ్మ, జనసైనికులు మరియు మండల నాయకులు పాల్గొనడం జరిగినది.