శెట్టూరు మండలం కన్వీనర్ లేపాక్షి ఈరన్న అధ్యక్షతన జనసేన ఆత్మీయ సమావేశం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం కన్వీనర్ లేపాక్షి ఈరన్న అధ్యక్షతన జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ బలోపేతం గురించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన ఏ విధంగా కృషి చేయాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ లు జనసైనికులకు తెలియజేయడం జరిగింది. అతి త్వరలోనే మండల కమిటీలు & గ్రామ కమిటీలు ఏర్పాటుకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగింది. త్వరలోనే కమిటీలు ఏర్పాటు కూడా ఉందని తెలియజేశారు. సిద్ధాంతాలు నచ్చిన వ్యక్తులకు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన్ జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్ పాల్గొనడం జరిగింది.