వెంకటాపురం గ్రామంలో గాజుగ్లాస్ టీ క్యాంప్

  • జనసంకల్ప యాత్ర టీం ఆధ్వర్యంలో గ్రామ గ్రామానికి “గాజుగ్లాస్” “టీ క్యాంప్”.. (3వ రోజు, వెంకటాపురం గ్రామం)

అవనిగడ్డ నియోజకవర్గం: మోపిదేవి మండలం, వెంకటాపురం గ్రామంలో జన సంకల్ప యాత్ర టీం ఆధ్వర్యంలో “టీ క్యాంప్” మరియు “మజ్జిగ పంపిణి” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంను తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నడకుదుటి జనార్దన్, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్, తెలుగుదేశం మండల సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఈ “టీ క్యాంప్” కార్యక్రమంను సందర్శించిన బాలసౌరి గారి ముఖ్య అనుచరుడు, బుద్ధ ప్రసాద్ గారి విధేయుడు, పెదకళ్ళేపల్లి నాయకులు “తోట కృష్ణాంజనేయులు గారు 5000/-” స్వచ్చందంగా విరాళం అందచేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామ టీడీపీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మండలంలో ఉన్న 13 గ్రామ పంచాయతీలల్లో ఈ టీ క్యాంప్ కార్యక్రమం మే 10వ తారీకు వరకు ప్రతి రోజు జరుగుతుంది.