శ్రీకాకుళం జిల్లా సన్ రైజ్ హోటల్ జనసేన బలోపేతం కోసం చర్చలు

పాలకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ శ్రీకాకుళం జిల్లా సన్ రైజ్ హోటల్ నందు జనసేన పార్టీ బలోపేతం కోసం రావడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన పార్టీ పిఏసి మెంబెర్, శ్రీమతి పాలవలస యసస్వి అరుకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గంగులయ్య సమక్షంలో పాలకొండ నియోజకవర్గం భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలంలో ఉన్న సమస్యలను పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని నియోజకవర్గం స్థానిక సమస్యలు తెలియజేస్తూ పాలకొండ నియోజకవర్గానికి సరైన, బలమైన, అందరిని కలుపుకునే నాయకత్వం కావాలి అని ఇక్కడ ప్రజా సమస్యల పై పోరాటం చేసే నాయుకులు ముందుండి నడిపించే నాయుకులు వస్తే ఖచ్చితంగా 2024 కి పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరుపునుంచి యంయల్ఏ ని గెలిపించుకునే సత్తా జనసైనికులు కి వీరమహిళలకు ఉన్నది అని పాలకొండ నియోజకవర్గం నాయుకులు పార్టీ పెద్దలకు వివరించడం జరిగింది.