రాజంపేట జనసేన అధ్వర్యంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు

  • జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు తెలిపిన యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట పట్టణం, యల్లటూరు భవన్ జనసేన పార్టీ కార్యాలయం నందు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని మాజీ జెట్పిటిసి యల్లటూరు శివరామరాజు మరియు జనసేన నాయకులు, జనసైనికులు వారిద్దరి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యల్లటూరు శివరామరాజు మాట్లాడుతూ అహింసామార్గంలో తెల్లదొరలను తరిమికొట్టి అఖండ భారతావనికి విముక్తి కలిగించిన భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నేడు బాపూజీ కలలు కన్న సంపూర్ణ గ్రామ స్వరాజ్యం దిశగా పయనించడమే. ఆ మహనీయుడికి ఇచ్చే ఘనమైన నివాళులని తెలియజేసారు. అదే విదంగా స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గురివిగారి వాసు, సుంకేసుల చౌడయ్య, కందుకూరి రాఘవ రాయల్, కె.నందు, ఎ.సాయి, ఆర్.హరీష్, యస్.సాయి, వి.సుమన్, గోవర్దన్, సాయి రాజు, కొండారెడ్డి విష్ణు రెడ్డి, పోకల వెంకటేష్ రాయల్, గంగిపోకు హరి, పత్తి నారాయణ, మౌల, చిట్టె బాస్కర్, రాజ ఆచారి, దర్భార్, జగనాదం రాజ, సిద్దారపు వెంకటేష్, సుబ్బు, సాలాచరణ్, తిరుమల ఆదినారాయణ రెడ్డి, టంగుటూరు నాగేంద్ర, జలగం తిరుపాలు, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.