శ్రీ బోయకొండ గంగమ్మ జాతరలో పాల్గొన్న గంగారపు రాందాస్ చౌదరి

మదనపల్లి మండలం, అమ్మ చెరువు మిట్ట దోబీ ఘాట్ దగ్గర వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ జాతరలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనియర్ గంగారపు రాందాస్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భగా వారికీ రజక సంఘం వారు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మదనపల్లి పట్టణ ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని రజక సంఘం ఆర్థిక అభివృద్ధికి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, చేనేత విభాగ నాయకులు, అడపా సురేంద్ర, ఐటి విభాగ నాయకులు జగదీష్, రామసముద్రం మండలం ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, రెడ్డమ్మ,రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.