గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనంతో “టీ” జనసేన

మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లి మండలం, నక్కలదిన్నె బిటీ కాలేజీ గ్రౌండ్ నందు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనంతో టీ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి వివరిస్తూ ఉంటే మాకంటే ముందుగా వాళ్లే ఈ అవినీతి పాలన గురించి చెప్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి విడత వారహి యాత్ర దిగ్విజయంగా పూర్తిచేసుకొన్నారు త్వరలోనే రెండవ విడత కూడా ప్రారంభిస్తారని అన్నారు. వారహి యాత్ర ఘనంగా జరుగుతుండడంతో ఈ వైసీపీ పేటియం బ్యాచ్ పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు జీవితాంతం బాధపడేలా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కార్యకర్తలుగా మా ప్రయత్నం మేము చేసి వైసీపీని భూస్థాపితం చేసి వీళ్ళకి మాటలతో కాకుండా ప్రజాస్వామ్యయుతంగా వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో బుద్ది చెప్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలా శివరాం రాయల్, ఐటీ విభాగ నాయకులు జగదీష్, సనా ఉల్లా, మోహన, నాగ, అర్జున, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.