హుజూర్ నగర్ జనసేనాని పుట్టినరోజు వేడుకలు

హుజూర్ నగర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గజనబాయిన సైదులు యాదవ్, షేక్ హాసన్ మియా లు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక కోదాడ రోడ్ లోని అభయాంజనేయ స్వామి గుడిలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని హోమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అమరవరం, లింగగిరి గ్రామాల్లో జనసైనికుల అధ్వర్యంలో కట్ చేయడం జరిగింది. హుజూర్ నగర్ లో రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శీలం నాగరాజు, గునగంటి రాజు, రమిశెట్టి తేజ, గుండా సత్యనారాయణ, తమ్మిశెట్టి వినాయకరావు, ఫాయాజ్, వేముల విజయ్, ఉదయ్, భరత్, అల్లావుద్దీన్, శ్రీను రెడపంగు, నాగరాజు, మధు ,శివ, శ్రీను, సాధనాల నాగరాజు, కొత్తపల్లి శ్రీను పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.