భూ వివాదంలో గాయపడిన వృద్ధ దంపతులకు అండగా నిలచిన గంగారపు

మదనపల్లి పట్టణంలో నీరుగట్టువారిపల్లె, అయోధ్యనగర్ లో భూ వివాదం విషయంలో దంపతులు వెంకట రమణారెడ్డి, లక్ష్మమ్మలపై కుమారుడు శ్రీనివాసులురెడ్డి ఆమానుషంగా దాడిచేయడం వలన గాయపడిన వృద్ధ దంపతులను జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చుల కోసం 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, తాళ్లగిరి, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, లవన్న, రాజారెడ్డి, పట్టణం ఉపాధ్యక్షులు పురం నగేష్ తదితరులు పాల్గొన్నారు.