లాలుపురం జనసేన కార్యాలయాన్ని సందర్శించిన బొలిశెట్టి

గుంటూరు: గుంటూరు రూరల్ మండలంలోని లాలుపురం గ్రామంలోని జనసేన పార్టి కార్యాలయాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు లాలుపురం గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేన పార్టి కార్యాలయాన్ని సందర్శించినారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, గుంటూరు పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, కాటూరి శ్రీనివాసరావు మాష్టారు సత్కరించి తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ లాలుపురం గ్రామంలో జనసైనికులైన సజ్జల రవికుమార్, సజ్జల నరేష్ కుమార్ లు తమ స్థలాన్ని జనసేన పార్టీ ఆఫీస్ నిర్మించుటకు ఉచితముగా ఇచ్చినందుకు ముందుగా సోదరులు ఇరువురికి నాహృదయపూర్వక కృతజ్ఞతలు తేలియజేయుచున్నాను. అలానే ఇంత చక్కటి దేవాలయం నిర్మించుటకు సహకరించిన ప్రతి జనసైనికునికి మీశక్తికి మించి పనిచేసిన కార్యకర్తలందరికీ నా అబినందనలు తెలుపుతున్నాను. మీలాంటి పని చేసే కార్యకర్తలే జనసేన పార్టికి పునాదిలాంటి వారని బోలిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహంతో మీరందరూ ముందుకు సాగాలని పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా మన జనసైనికులు, వీరమహిళలు, యువకులు, కృషి చేయగలరని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అన్నారు. అనంతం బోలిశెట్టి శ్రీనివాసరావు నేరేళ్ళ సురేష్, మరియు స్థలదాతలు రవికుమార్, నరేష్ కుమార్, కాటూరి శ్రీనివాసరావు, తదితరులను ఘనంగా సత్కరించినారు. తర్వాత నాయకులు, గ్రామ కార్యకర్తలను బోలిశెట్టి శ్రీనివాసరావుకి పరిచయం చేసినారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ అధ్యక్షుడు విష్ణుమెలకల ఆంజినేయలు, సూదాబత్తుల శివ, శీలం హరి, తన్నీరు క్రిష్ణ, తోట శివ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.