గంటా ప్రసాద్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన పితాని

రాజమండ్రి: రాజమండ్రికి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి భర్త గంటా ప్రసాద్ అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గంటా ప్రసాద్ పార్థివదేహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. వీరివెంట జక్కంశెట్టి బాలకృష్ణ(పండు), సానబోయిన మల్లికార్జున రావు, సానబోయిన వీరభద్రరావు తదితరులు ఉన్నారు.