శ్రీ గౌరి శంకరుల రథోత్సవంలో పాల్గొన్న గంటా స్వరూప

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో జరిగిన శ్రీ గౌరి శంకరుల రథోత్సవానికి జనసేన పార్టీ ఆడపడుచు రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె స్వామి వారిని దర్శించుకుని 5000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, చదువు నాగేశ్వరరావు, చదువు ముక్తేశ్వరరావు, దేవన కృష్ణ, కొచ్చర్ల బాబి, చంటి జంబుపట్నం, కొచ్చర్ల భరత్ కుమార్, శ్రీరంగపట్నం గ్రామ జనసేన పార్టీ ప్రసిడెంట్ మద్దాల గంగాధర్, తన్నీరు తాతాజీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ అడపా అంజిబాబు, మండల కార్యదర్శి కోలా జాన్ ప్రసాద్, గొల్ల కోటి కృష్ణ, ఎవ్వాకుల శ్రీను, కర్రీ శ్రీను, అతికింశెట్టి శ్రీను, జాజుల ప్రసాద్, సోము, జాజుల కృష్ణ జనసేన పార్టీ వీరమహిళలు, గ్రామ ఆడపడుచులు గ్రామ పెద్దలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు.