టీం పిడికిలి పోస్టర్లను ఆవిష్కరించిన గరివిడి జనసేన

చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడిలో బుధవారం జనసేన నాయకులు సిగా తవిటి నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 30 కోట్ల విడుదల కార్యక్రమమునకు జమ్ము ఆదినారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జమ్ము ఆదినారాయణ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు అండగా చనిపోయిన కౌలు రైతులకు 3000 మందికి 30 కోట్లు రూపాయలు ప్రకటించిన సమాచారాన్ని ప్రజలలోనికి తీసుకు వెళ్లాలని.. రైతు భరోసా యాత్రకు మద్దతుగా టీం పిడికిలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగినది.

ఈ సందర్భంగా ఎప్పటినుంచో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గానీ మరియు జిల్లాలో మంత్రులుగా గానీ ఉన్నప్పటికీ ఇప్పటికీ కనీసం తన సొంత నిధులు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని వైనం మనమందరం చూస్తున్నాము. అలాగే ఎన్ని ప్రభుత్వాలు మారినా అన్నం పెట్టే రైతులు పరిస్థితి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో రైతులు పట్ల, వారు ఎదురుకుంటున్న సమస్యలు పట్ల అవగాహన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనని, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో తన కష్టార్జితం నుంచి 30 కోట్ల రూపాయలు అందిస్తున్న మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని కొనియాడారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే ఏకైక పార్టీ జనసేన మాత్రమేనని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సిగ తవిటినాయుడు, దన్నన యేసు, యడ్ల సంతోష్, మహంతి సూర్యనారాయణ, మొయిద శ్రీరామ్, ముల్లు జగదీష్, పిన్నింటి సాయి, కే.ఎల్. నరసింహమూర్తి, చందక బాలకృష్ణ, పొగిరి శ్రీరామ్, రామునాయుడు, దాసరి పైడితల్లి, గొల్లబాబు మరియు నాలుగు మండలాల జనసైనికులు పాల్గొన్నారు.