జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, జి సిగడం మండలం ,మెట్టవలస గ్రామంలో మన జనసైనికుడు కిల్లరి అప్పలనాయుడు (25) ప్రమాదవశాత్తూ బైక్ ఏక్సిడెంటులో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ అతని కుటుంబం సభ్యులను పరామర్శించి 5000 రూపాయల ఆర్ధికసాయం అందించడం జరిగింది. ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరుపున మేము మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివ, బాబాజీ, రమణ, సూర్యారావు, సాయి, చందు, ఉమ, చంటి జనసైనికులు పాల్గొన్నారు.