అచ్చపువలస గ్రామంలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన

  • గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 2 వ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గఒ, వీరఘట్టం మండలం. గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం అచ్చపువలస గిరిజన గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మత్స పుండరీకం, జనసేన జాని, కర్ణేన సాయి పవన్, దూసి ప్రణీత్ పర్యటించడం జరిగింది. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పవన్ కళ్యాణ్ తెలుసుకునే విధానం, సమస్యల పట్ల స్పందిస్తున్న పద్ధతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుంది ప్రజలకు జనసేన బరోసాగా నిలుస్తోంది అని మత్స పుండరీకం అన్నారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గెలిచే వరకు ముద్దులు పెట్టి గెలిచాక పన్నులతో గుద్దేసి బస్సు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి మూడేళ్ల పాలనలో మాలాంటి వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడఅని గిరిజన ప్రజలు అంటు, తమ ప్రధాన సమస్యలు వివరించారు. అనంతరం జనసేన జాని మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడుతు, ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేద్దాం అని అన్నారు. ఒక వ్యక్తిలో ఉండే నిజాయితీ, నిస్వార్థం, నిబద్ధత, సమాజసేవ పట్ల అంకిత భావం వల్ల కోట్లాదిమంది వ్యక్తులు ఆ వ్యక్తిని ఆరాధిస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మహోన్నత మానవతామూర్తి పవన్ కళ్యాణ్. అందుకే ఆత్మహత్య చేసుకున్న మూడు వేలమంది కౌలురైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చెప్పున ముప్పై కోట్ల రూపాయలు తన సొంత డబ్బుని పంచుతున్నారు ఈరోజు కోట్లాదిమంది అతనికి అండగా నిలబడతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ కి మద్దతు పలకడం ఖాయం – జనసేన విజయకేతనం తథ్యం అని కర్ణేన సాయి పవన్, దూసి ప్రణీత్ ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు బి.పి.నాయుడు, వావిలపల్లి నాగభూషన్, కంటు మురళి తదితరులు పాల్గొన్నారు.