రోడ్ల దుస్థితిపై గళమెత్తిన గిరీష్ కుమార్

*#GoodMorningCMSir

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ పరిధిలో ఉన్న అల్లూరి సీతారామరాజు వంతెన డౌన్ లో గల రోడ్డు దుస్థితిపై విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం, 27వ డివిజన్ జనసేన ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి. గిరీష్ కుమార్ #GoodMorningCMSir కార్యక్రమలొ భాగంగా నిరసన తెలియ జేయడం జరిగింది.. అనునిత్యం కొన్ని వందల వాహనాలు యొక్క రోడ్ వెంబడి ప్రయాణిస్తూ ఉంటాయి.

ఏలూరు రోడ్డును బి.ఆర్.టి.ఎస్ రోడ్డును సామమూర్తి రోడ్డును కలిపే యొక్క ప్రధాన రోడ్డు ద్వారా అనేకమంది విద్యార్థులు పాదాచారులు, భవన నిర్మాణ కార్మికులు, తాపీ పనివారు, కూరగాయల వ్యాపారం చేసేవారు వంతెన వెంబడి వెళ్తూ ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అనునిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో ఇదే ఒక ప్రాంతం అయినప్పటికీ కూడా.. ఈ రోడ్డును బాగుచేసే నాధుడు గానీ ఎవరూ కనిపించలేదు. వర్షం వస్తే డ్రైనేజీ వాటర్ కూడా ఇక్కడ పొంగుతూ పాదచారులకు ఇబ్బందికరంగా ఉంటుంది. కావున ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్లు తెరిచి బాగు చేస్తే బాగుంటుందని స్థానికులు, ప్రజలు కోరుకుంటున్నారని పగిడిపల్లి. గిరీష్ కుమార్ #GoodMorningCMSir కార్యక్రమలొ భాగంగా తెలియ జేసారు.