జనసేన పార్టీకి ఈసారి ఒక అవకాశం ఇవ్వండి పాదయాత్రలో బత్తుల దంపతులు

రాజానగరం, జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు శ్రీమతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీని బలోపేతం చేసెవిధంగా నిర్వహిస్తున్న ‘జనంకోసం జనసేన మహా పాదయాత్ర’ 22వ రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో చిరుజల్లుల మధ్యన, ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగింది. నాయకులు బత్తుల బలరామకృష్ణ ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, జనశ్రేణులు సంయుక్తంగా జనసేన పార్టీ విధి విధానాల ముద్రించిన కరపత్రాలు పంచుతూ, నిస్వార్ధపరుడు, నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా ఉండే ప్రజానాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈసారి అవకాశం ఇవ్వాలని, చాప కింద నీరులా రాష్ట్రం నలుమూలల ప్రజాదరణతో రోజురోజుకీ బలపడుతున్న జనసేన పార్టీని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలు సహకరించాలని జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు జరిగే మేలును, సమాజంలో వచ్చే మార్పును వివరిస్తూ, గ్రామంలో ప్రజల ఆదరణతో ఈ పాదయాత్ర ముందుకు సాగింది. వీరి వెంట నిడిగట్ల గ్రామ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.