బొబ్బిలి వీణకు ప్రాముఖ్యతను కల్పించండి: బాబు పాలూరు

  • బొబ్బిలి సంస్కృతికి అద్దం లాంటి బొబ్బిలి వీణకు ప్రాముఖ్యతను కల్పించండి – జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి పట్టణం 8వ వార్డు అమ్మి గారి కోనేరు గట్టు వద్ద గల కూడలిలో, ప్రపంచమంతట ప్రసిద్ధిగాంచిన బొబ్బిలి వీణ ప్రాంగణాన్ని ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, బొబ్బిలి నాయకులు లెంక రమేష్, పల్లెం రాజా, చీమల సతీష్, శ్యామ్, రమేష్, మోతి దాసు, ఉమా మహేష్, పొట్నూరు జన, జగన్నాథం, వెంకట రమణ, చంద్రమౌళి, సతీష్, గౌరీ శంకర్, మణికంఠ తదితర జనసైనికులు మరియు వీరమహిళలు బంటుపల్లి దివ్య, గైనేడి రమ్య, అలివేలు తదితరులు!! ఒకవేళ బొబ్బిలి వీణ ప్రాంగణాన్ని ఏర్పాటు చెయ్యకుండా మీకు నచ్చిన విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని చేస్తే ఊరుకోబోమని, మన బొబ్బిలి సంస్క్రుతి, చరిత్రను మన భావితరాలకు మరియు ఈ ప్రపంచానికి చాటిచెప్పేలాగా 2024 లో జనసేన టీడిపి ప్రభుత్వం స్థాపించాక ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని బాబు పాలూరు మీడియా ముఖంగా చెప్పారు.