రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తున్న జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి: బత్తుల
జనం కోసం జనసేన.. ‘మహా పాదయాత్ర’ 27వ రోజులో భాగంగా…. రాజానగరం నియోజకవర్గఒ కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో… ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగింది… నాయకులు బత్తుల బలరామకృష్ణ.. ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, జనశ్రేణులు సంయుక్తంగా జనసేన పార్టీ విధి విధానాల ముద్రించిన కరపత్రాలు పంచుతూ.. నిస్వార్ధపరుడు, నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అవకాశం ఇవ్వాలని, చాప కింద నీరులా రాష్ట్రం నలుమూలల ప్రజాదరణతో రోజురోజుకీ బలపడుతున్న జనసేన పార్టీని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలు సహకరించాలని…. జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు జరిగే మేలును, సమాజంలో వచ్చే మార్పును వివరిస్తూ, గ్రామంలో ప్రజల ఆదరణతో ఈ పాదయాత్ర ముందుకు సాగింది… వీరి వెంట నరసాపురం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మట్టా నాగేశ్వరరావు, సదువు శ్రీను, బొజ్జప సత్యనారాయణ, అడ్డాల దుర్గ, ప్రగడ జోగారావు, ప్రగడ దుర్గ, వెలిసి మణికంఠ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.