రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి: మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి కార్యక్రమంలో భాగంగా సోమవారం పిఠాపురం మండలం జములపల్లి గ్రామంలో జరిగింది. స్థానిక కార్యకర్తలు, నాయకుల సహకారంతో మాకినీడి శేషుకుమారి ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికై పవనన్నకు ఓటు వేసి జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వలని కోరారు. ఈ సందర్భంగా ఆమె జనసేన పార్టీ వ్యూహాలు కరపత్ర రూపంలో వారికి వివరించారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అందరూ గాజు గ్లాసు కి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమనికి సహకరించిన గ్రామ నియోజవర్గ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిఠాపురం పట్టణ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాశరావు, దడల రాహుల్, సికోలు దొరబాబు, వడ్డీ నాని, దడల యేసు, ఎస్ సిద్దు, శివకోటి, మచ్చ అప్పారావు, పబ్బినీడి దుర్గాప్రసాద్, నామా శ్రీకాంత్, కొడమచిలి దుర్గాప్రసాద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.