డిజిటల్ క్యాంపైన్ వివరాలు తెలియచేసిన ఏలూరు జనసేన

ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో 18,19,20 వ తేదీలలో జరుగబోయే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ట్యాగ్ లైన్ తో రాష్ట్రంలో ఉన్న M.P లకు ట్విట్టర్ వేదికగా తెలియపరిచే కార్యక్రమాల గురించి చర్చించుకొనుటకు కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, నగర అధ్యక్షుడు నాగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, మండల ఉపాధ్యక్షుడు సుందరనీడి ప్రసాద్, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నగర జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, నాయకులు పైడి లక్ష్మణరావు, జంగం కృపానందం, తుమరాడ రమణ, తదితరులు పాల్గొన్నారు.