సింగరాయకొండ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

స్థానిక సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని శ్రీ వెంకటేశ్వర కాలనీ చర్చిలో స్థానిక జనసేన నాయకులు యన్నం రాము మరియు జనసైనికులు. ఏసుక్రీస్తు ప్రభువు పుట్టిన రోజు కేక్ కటింగ్ మరియు ప్రార్ధనలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ వేడుకలను జరుపుకోవాలని, అలాగే మండల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని ఏసుక్రీస్తును ప్రార్థించారు. ఈ మీటింగులో స్థానిక జనసేన నాయకులు యన్నం రాము, కిచ్చెంశెట్టి రవి, పోకల రవీంద్ర, మంచాల షణ్ముఖి, అయినా బత్తిన రాజేష్, పాడే సురేష్, దేవినేని బాలాజీ, రానా, నాగార్జున, దండే ఆంజనేయులు, కాసుల శ్రీనివాస్, పసుపులేటి శ్రీకాంత్, చెన్నంశెట్టి సాంబ మరియు జనసైనికులు పాల్గొన్నారు.