ఘనంగా అనంతపురం జిల్లా జనసేన మండలాధ్యక్షుల ప్రమాణస్వీకారోత్సవం

జనసేన పార్టీ అధినేత గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళవారం అనంతపురం జిల్లాకు సంబంధించిన 63 మండలాల జనసేన పార్టీ మండల అధ్యక్షుల ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టిసి వరుణ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసుదన్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కార్యవర్గ సమక్షంలో నూతనంగా నియమించినటువంటి మండలాధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన వారందరూ తమ మండలంలోని ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ ఇంచార్జ్ ల సహకారంతో కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు సాగాలన్నారు. నూతనంగా ఎన్నుకున్న మండల అధ్యక్షులతో చర్చిస్తూ రాబోవు రోజుల్లో నియోజకవర్గాల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి మండల అధ్యక్షులు కృషి చేయవలసిందిగా అంతేకాకుండా త్వరలో వచ్చే మండల కమిటీలోనూ ముందునుంచి పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని… ప్రస్తుతం నెలకొన్న దుర్మార్గమైన ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ తీరును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి రాబోవు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడే జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసేంతవరకు మనమందరం కలిసి కృషి చేద్దామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు, జనసేన మండల అధ్యక్షులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.