కైకలూరు జనసేన ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్

కైకలూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ ల పిలుపు మేరకు, 3 వరోజు మొద్దునిద్ర పోతున్న వై ఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం, పడమటిపాలెం నుంచి లోడిదలంక గ్రామం మీదగా, మల్లంపూడి వెళ్ళే రోడ్డు పూర్తిగా గుంతలు పడి నడవడానికి వీలు లేకుండా పాడైపోయింది. ఈ రోడ్డు దుస్థితిని తెలియచేసేందుకు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో జనసేన పార్టీ జెండాలతో డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొల్లు సర్పంచ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బట్టు లీలా కనకదుర్గ, కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు వలవల రవితేజ, అమజాల శ్రీరామ్ సాయి, ఏర్రింకి శ్రీరామకృష్ణ, కలిదిండి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి విన్నకోట సుధాకర్ గంటా సోమయ్య మరియు కైకలూరు నియోజకవర్గం జనసైనికులు పాల్గొన్నారు.