పెంచిన కరెంటు చార్జిలను తగ్గించాలని మరియు పలు సమస్యలపై సిద్దవటం జనసేన వినతిపత్రం

సిద్ధవటం గ్రామ పంచాయతీలో విపరీతంగా పెరిగిపోయిన కోతులను పట్టుకొని అడవిలో వదలమని కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అలాగే కూలిపోయిన సిద్ధవటం కోట గోడను నిర్మించి కోటను అభివృద్ధి చేయాలని కలెక్టర్ గారిని కోరడమైనది. దీనిపై స్పందించిన కలెక్టర్ గారు సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు రాజేష్ గారు, సిద్ధవటం గ్రామ పంచాయతీ 12వవార్డు నెంబర్ ఆవుల నాగరాజు 11వవార్డు నెంబర్ పసుపులేటి కళ్యాణ్ పాల్గొన్నారు.