తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. కరోనా సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో విధించిన 50 శాతం కోత మొత్తాన్ని తిరిగి చెల్లించేలా సీఎం కేసీఆర్ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణారావును ఆదేశించారు. దీనికోసం దాదాపు 120 నుంచి 130 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను కేసీఆర్ అభినందించారు. ఇకపై.. హైదరాబాద్లో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.