గోపాలపురం జనసేన మండల స్థాయి కార్యవర్గ సమావేశం

గోపాలపురం నియోజకవర్గం: గోపాలపురం మండలం కరగపాడు, బుచ్చియపాలెం గ్రామంలోని గ్రామ అధ్యక్షులు కె. శివ ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవర్గ నాయకులు దొడ్డిగర్ల సువర్ణ రాజు, గ్రామంలోని జనసైనికులతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసారు. సమావేశంలో భాగంగా గ్రామ కమిటీ, మండల కమిటీల గురించి, పార్టీ బలోపేతం గురించి, రాష్ట్రంలో పార్టీ చేపట్టే రోడ్డు యాత్ర, పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు, సాగిపాడు నుండి గోపాలపురం రోడ్డు సంబంధించి గ్రామస్తులు పడే ఇబ్బందులను చర్చించి, ఇక్కడ ఉన్న జనసైనికులతో పాటు గ్రామ ప్రజలు కూడా జనసేన చేపట్టబోయే పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోసిన గణపతి, ప్రగడ రాంబాబు, సూర్య భగవాన్, సత్యనారాయణ, కోణాల శ్రీను, ఆకుల శ్రీనివాసరావు, శ్రీను, ఆకుల గిరి, మొత్తం బోయిన రమణ, వాసు బోయిన వీరభద్ర రావు, లక్ష్మణ్, ఆకుల వెంకటేశ్వరరావు, నరేష్, పంది గంగరాజు మరియు జనసేనకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.