నంద్యాల మధును పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ బుధవారం ఇటీవల ప్రమాదంలో గాయపడిన ఐ. పోలవరం మండలం, మురమళ్ల గ్రామానికి చెందిన నంద్యాల వెంకటేశ్వరరావు (బుజ్జి) కుమారుడు నంద్యాల మధును ఆత్మీయంగా పలకరించి దైర్యం చెప్పారు. వీరి వెంట రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి పండు, సలాది రాజా, దూడల స్వామి, పితాని రాజు, పోలిశెట్టి వెంకటేశ్వరరావు గంజా యేసు, జి.తాతాజీ మీసాల నాని, పోలిశెట్టి మధు, చిక్కాల రాజేష్, దంగేటి మాణిక్యాలరావు, ఉద్దిశ మాణిక్యాలరావు, కేశనకుర్తి గోపాలకృష్ణ, బండారు సాయి గణేష్, నక్కిరెడ్డి సాయి మణికంఠ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.