మెగా అభిమాని కుటుంబానికి గోరంట్ల జనసేన ఆర్థిక సహాయం

పెనుకొండ నియోజకవర్గం: సోమందేపల్లిలోని షిర్డీ నగర్ కు చెందిన రామాంజనేయులు ఇటీవలే చనిపోవడం జరిగింది. రామాంజనేయులు మెగా అభిమాని. రామాంజనేయులు మరణం తర్వాత వారి కుటుంబ పరిస్థితి చూసిన గోరంట్ల జనసేన పార్టీ నాయకులు సోమవారం మృతుడి తల్లిని, కుతురును కలసి వారిని పరామర్శించి, వారికి 22 రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే భవిష్యత్ లో వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా అభిమాని మను, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, కార్యనిర్వాహక జిల్లా సభ్యుడు వెంకటేష్, మండల నాయకుడు నరేష్ పాల్గొన్నారు.