జనసేనలో చేరిన గొర్లె తిరుపతి నాయుడు

విజయనగరం: విజయనగరం జిల్లా, సాలూరు నియోజకవర్గం వైసీపీ నాయకుడు, ఉత్తరాంధ్ర బీసీ సీనియర్ నాయకుడు మరియు రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి గొర్లె తిరుపతి నాయుడు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చెర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సభ్యురాలు మరియు విజయనగరం నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి సమన్వయం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం అయింది.