స్కూల్ పిల్లల జీవితాలతో ఆటలడుతున్న ప్రభుత్వం

తిరుపతి, స్కూల్ పిల్లల జీవితాలతో ఆటలడుతున్న రాష్ట్రప్రభుత్వం – స్కూల్ వద్ద ధర్నా చేపట్టి ఆన్లైన్ క్లాసులు ద్వారా పిల్లలు క్షేమంగా ఉంటారని స్కూల్స్ వద్ద నిరసన చేపట్టిన జనసేన. అన్ని రాష్ట్రాలలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ద్వారా విద్యను బోధిస్తుంటే మన రాష్ట్రంలో కనీసం జాగ్రత్తలు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకిస్తూ జనసేన నిరసన దీక్ష విద్యార్థులకు వెంటనే ఆన్లైన్ క్లాసులు ద్వారా విద్యను బోధించి తగు జాగ్రత్తలు చేపట్టాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, సుమన్ బాబు, బలరాం, మునిస్వామి మరియు వీరమహిళలు జిల్లా కార్యదర్శులు కీర్తన, అమృత, అరుణ, జనసైనికులు మనోజ్, కిషోర్, సాయి దేవ్, రాజేష్, హేమంత్, రాజేంద్ర, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.