మీరు, నేను, మనం, మన నియోజకవర్గం పోస్టర్ ఆవిష్కరించిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, ఈనెల 14వ తేదీ హైదరాబాదులో జరగనున్న మీరు, నేను, మనం, మన నియోజకవర్గం పోస్టరును బుధవారం తాడేపల్లిగూడెం జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన నియోజవర్గం చెందిన ఐటీ ఉద్యోగులు మరియు వ్యాపారవేత్తలు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో చర్చించేందుకు ప్రతి ఒక్కరు వైష్ణవి గ్రాండ్ కూకట్పల్లి జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటి ఉద్యోగులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.