జూబ్లీహిల్స్‌ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి: రామగుండం జనసేన

*జూబ్లీహిల్స్‌ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపిన రామగుండం నియోజకవర్గం జనసేన నాయకులు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్ మార్గదర్శకాలతో.. జనసేన విద్యార్థి విభాగం ఉమ్మడి జిల్లా భాద్యులు మహేష్ పెంటల సూచనలతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ విద్యార్థి విభాగం కొ ఆర్డినెటర్ జుల నవీన్ ఆధ్వర్యంలో.. స్థానిక రామగుండం నియోజకవర్గంలో జూబ్లీహిల్స్‌లో పదిహేడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన నిందితులను వెంటనే శిక్షించాలని నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ రావుల సాయి క్రిష్ణ హాజరై మాట్లాడుతూ.. అరేండ్ల పాపకు, పదహారెండ్ల అమ్మాయికీ, అరవై ఎండ్ల బామ్మకు రక్షణ లేకుండా పొయింది అని విమర్శించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని.. జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేకల రాజ్ కుమార్, మంథని శ్రవణ్, ఎమూర్ల రంజిత్, మోతే రవికాంత్, తుంగపల్లి కుమార్, బండరి తిరుపతి, మంథని మధు, చిన్నపెళ్లి శ్రీకాంత్, ఎడ్ల లోకేష్, పెగడపల్లి ప్రకాశ, మృణాళ్, కొప్పుల సన్నిత్, ఒగ్గు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.