బోనకల్ నందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి: జనసేన

బోనకల్ నందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ.. స్థానిక డిప్యూటీ తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ విద్యార్ధిభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ తో పాటు బోనకల్ మండల అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ బోనకల్, చింతకాని మండల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక హాస్టల్ వసతి లేక మధ్యతరగతి కుటుంబాల పేద విద్యార్థులు చాలీచాలని జీవితంతో జీవిస్తూ అటు ఖమ్మం ఇటు వైరా ఇటు మధిర 30 కిలోమీటర్ల పరిధిలో కళాశాలకు వెళ్లవలసిన పరిస్థితి ఉన్నది రోజువారీగా వెళ్లి వచ్చే స్తోమత లేక కొంతమంది పేద విద్యార్థులు ఇంటర్ తోనే చదువుల మానేసిన దాఖలాలు ఉన్నాయి కావున పేద విద్యార్థుల బాధను గ్రహించి ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తారని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని త్వరగా బోనకల్ మండలానికి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ మండల కమిటీ మరియు విద్యార్థి విభాగం తరపున కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్, మండల ఆర్గనైజింగ్ సెక్రెటరీ మోదుగు పవన్, బోనకల్ మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎస్కే జానీ పాషా, తదితరులు పాల్గొన్నారు.