గుంతలమయంగా ప్రధాన రహదారులు స్పందించని ప్రభుత్వం: రేఖ గౌడ్

ఎమ్మిగనూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ అధ్యక్షతన గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే నిరసన కార్యక్రమంను ఎమ్మిగనూరు పత్తికొండ ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రేఖ గౌడ్ మాట్లాడుతూ జూలై 15 నాటికి రహదారుల నిర్మాణం పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. రోజు రోజుకు రహదారిలో పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రహదారుల మరమ్మతులు చేపట్టి వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, బజారి, వినయ్, గోరంట్ల, షబ్బీర్, రమేష్, వెంకటేష్, కాజా, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.