రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎంకి రెండోరోజు శుభోదయం పలికిన జనసేన

విజయనగరం: డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా రోడ్లపై ఉన్న పాడైపోయిన గుంతలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రతీ జనసైనికులు ఈ నెల 15,16,17 తేదీల్లో GoodMorningCMSir అని పోస్ట్లు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో రెండోరోజైన శనివారం ఉదయం కలెక్టరేట్ కూడలిలో ఉన్న రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రక్కన వాటర్ ట్యాంక్ వద్ద భారీ గోతుల వద్ద జనసేన పార్టీ నాయకులు నిరసన తెలిపారు.

ఈసందర్భంగా మీడియా తో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ జులై 15నాటికి రోడ్లపై గుంతలు పూడ్చుతామని చెప్పి, ప్రజలకు మాట ఇచ్చి, మోసం చేసిన ఘనత మరియు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు.

ప్రజలపక్షాన నిరంతరం నిలబడి ప్రజలకు న్యాయం జరిగేవరకు జనసేన తరుపున పోరాడుతామని అన్నారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), డాక్టర్ ఎస్. మురళీమోహన్, వంక నరసింగరావు, లోపింటి కళ్యాణ్,పిడుగు సతీష్,మిడతాన రవికుమార్, దంతులూరి రామచంద్ర రాజు,దువ్వి రాము,అడబాల వెంకటేష్, భాస్కర్, రాజు పాల్గొన్నారు.