పట్టభద్రుల ఓటర్ల ముసాయిదా.. సవరణలకు, దరఖాస్తులకు వచ్చే నెల 8వ తేదీ వరకు గడువు

పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా వచ్చేసింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల ముసాయిదాను అధికారులు విడుదల చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో తొమ్మిది జిల్లాలున్నాయి. ముసాయిదా ప్రకారం 28 లక్షల మంది పురుషులు, 16 లక్షల మంది మహిళలు, 60 మంది ఇతరులు మొత్తం 4,48,961 మంది ఓటర్లున్నారు.

ముసాయిదాను జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలోని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి కార్యాలయంతోపాటు వివిధ జిల్లాల్లోని సహాయ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌, రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు, వాటిని పరిశీలించుకోవాలని తెలిపారు.

అంతేకాకుండా సీఈవో వెబ్‌సైట్‌ https://www.ceotelangana.nic.in నుంచి కూడా జాబితాను పొందవచ్చని చెప్పారు. జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే వచ్చే జనవరి 8వ తేదీ వరకు సవరణ దరఖాస్తులు పంపాలని కోరారు. కొత్తగా ఓటర్లుగా నమోదు కావాలనుకునేవారు కూడా వచ్చే వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.