ఘనంగా పంతం నానాజీ జన్మదిన వేడుకలు

  • నానాజీ ఆధ్వర్యంలో నా సేన కోసం – నా వంతు
  • నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్, జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ జన్మదిన వేడుకలు కాకినాడ గొడరిగుంట వారి స్వగృహం వద్ద ఘనంగా నిర్వహించిన కాకినాడ రూరల్ జనసేన నాయకులు, జనసైనికులు. ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియచేయడానికి వచ్చిన జనసైనికులచే పూలబొకేలు, మాలలు బదులుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు నా సేన కోసం – నా వంతు కార్యక్రమాన్ని పంతం నానాజీ నిర్వహించడం జరిగింది. మరియు ఆదివారం కొవ్వాడ, రమణయ్యపేట, స్వామినగర్ ప్రాంతాలనుండి వైసీపీ, టీడీపీ కి చెందిన నాయకులు కార్యకర్తలు సుమారు 100 మంది నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి అభినందనలు తెలుపుతూ సాధారంగా ఆహ్వానం పలికారు. ఆదివారం జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నానాజీకి అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, పిఏసి సభ్యులు, కాకినాడ నగర ఇంచార్జ్ ముత్తా శశిధర్, సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ మరియు, కరప, కాకినాడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కాకినాడ రూరల్, మరియు కరప మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.