బొమ్మూరులో ఘనంగా జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం

రాజమండ్రి: బొమ్మూరులో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం మరియు బొమ్మూరు గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి మరియు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి బొమ్మూరు జనసేన నాయకులు యార్లగడ్డ సునీల్ కోట్ల దుర్గారావు మరియు అడ్డాల శ్రీను ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన రాజమండ్రి సిటీ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. మరియు ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యుల్ని ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ జనసేన పార్టీని మరింత బలోపితం చేయాలని జనసేన కార్యకర్తలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలందరూ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ఈ జగన్ పాలనను ప్రజలు తరిమి తరిమి కొడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన యార్లగడ్డ సునీల్ మరియు కోట్ల దుర్గ అడ్డాల శ్రీనును అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.