ఓయూలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన విద్యార్థి విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మహేష్ పెంటల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ పుట్టి దశబ్దకాలం గడిచింది. ఈ దశాబ్ద కాలంలో జనసేన తన రాజకీయ పరిణితిని అంతకంతకూ పెంచుకుంటూ ఓపికతో ఎన్నో సమస్యలను ఎగురుకుంటూ వేల మంది యువతను రాజకీయాల్లోకి ప్రభావితం చేస్తూ సామాజిక రాజ్యాధికారంకై, బలహీనుల పక్షాన బలంగా నిలబడుతూ ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో కు అడుగుపెట్టబోతుంది అని తెలియశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వినోద్ నాయక్, పొన్నం పవన్, శ్రీనివాస్ చెనిగెల, అలువల అజయ్, పృద్వి, సురేష్, ఉదయ్, దేవేందర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.