పాలకొండ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, నడుకూరులో మంగళవారం జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేసి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స పుండరీకం మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోని మరింత చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ నిస్వార్ధంగా పనిచేస్తున్న రాజకీయ నాయకుడు ఎల్లవేళలా ప్రజలకోసం పరితపించే ప్రజనాయకుడు శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారి నాయకత్వం బలపరచాలని, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తు కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు గ్రామ స్థాయిలో జనసేన పార్టీ అభివృద్ధి కి కృషిచేయాలని తెలియజేసారు. ఈ కర్ణేన సాయి పవన్, ముంజు సాయి కుమార్, మాచర్ల చందు, వాన మహేష్, కలిపిల్లి సింహాచలం, చింత గోవర్ధన్, దండెల సతీష్, వావిలపల్లి చిన్న తదితరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.