ఘనంగా గుంటూరు 12వ డివిజన్ జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

గుంటూరు నియోజకవర్గం: గుంటూరు 12వ డివిజన్ జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జనసేన పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, 12వ డివిజన్ జనసైనికులు, వీరమహిళలు ఎప్పటికప్పుడు వార్డు సమస్యలపై స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడం, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వచ్చే ఎలక్షన్స్ కి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. 12వ డివిజన్ అధ్యక్షుడు కొణిదె దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 12వ డివిజన్ జనసేన పార్టీ కార్యాలయాన్ని నాదెండ్ల మనోహర్ గారు చేతుల మీదగా ఆవిష్కరించడం మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని, పార్టీ కార్యాలయం కాకుండా ఒక దేవాలయంగా భావిస్తూ వార్డు ప్రజల నుండి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ఒక ప్రసాదంలా స్వీకరించి సమస్యను పరిష్కరించే దిశగా జనసేన పార్టీ 12 డివిజన్ ఎప్పుడూ ముందుంటుందని, ఈ ప్రారంభోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, అధికార ప్రతినిధి ఆళ్ల హరి, రాయపాటి అరుణ, నగర కమిటీ మరియు డివిజన్ అధ్యక్షులు, 12వ డివిజన్ సెక్రెటరీ శివసుందర్ కుమార్, అనిల్ హరి, పండు, అంజన్, మురళి శివ, లలిత, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.